దవాఖానలో అందరూ అటెన్షన్.. దిశ కథనానికి స్పందన

by Disha Web Desk 6 |
దవాఖానలో అందరూ అటెన్షన్.. దిశ కథనానికి స్పందన
X

దిశ బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలో గల ప్రాథమిక దవాఖానలో మండల వైద్యాధికారితో పాటు సిబ్బంది శనివారం ఉదయం అందరూ సమయానికి విచ్చేసి అటెన్షన్ గా ఉన్నారు. శనివారం దిశ దిన పత్రిక లో అలంకార ప్రాయంగా దవాఖాన అన్న కథనం రావడంతో వైద్య సిబ్బందిలో మార్పు వచ్చింది. ఉదయం 9 గంటలకే మండల వైద్యాధికారి రఘుపతి విచ్చేయడం గమనార్హం. అదేవిదంగా ఇంచార్జి వైద్యులు నరేందర్, వైశాలి, ఫార్మసిస్ట్ రాములు, సీహెచ్వో రవీందర్, సూపర్ వైజర్ సాయమ్మలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి సమయ పాలన ఇలాగే పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది సిబ్బందిలో మరింత మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని హెచ్చరించారు. దవాఖానలో వైద్యాధికారితో పాటు వైద్య సిబ్బంది సమయానికి రావడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Also Read.......

ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్



Next Story

Most Viewed